భారత్ లో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మే 25, సోమవారం ఉదయానికి మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50,231 కి చేరింది. వీరిలో 16,400 మంది కోలుకోగా, 1635 మంది మృతిచెందారు. ఒక్క ముంబయి నగరంలోనే 30,542 కేసులు నమోదయ్యాయి.
ఇప్పటిదాకా థానే లో 6625, పుణేలో 5682, ఔరంగాబాద్ లో 1256, నాసిక్ లో 936, రాయఘడ్ లో 742, పాల్గర్ లో 676, సోలాపూర్ లో 601 కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో 1600 మందికి పైగా పోలీసు సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పెద్ద సంఖ్యలో కరోనా కేసులతో ప్రజల్లో ఆందోళన పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలుతో పాటు కీలక చర్యల దిశగా ప్రణాళికలు రూపొందిస్తుంది. కేరళలో కరోనా కట్టడికి కృషి చేసిన వైద్యుల, నర్సుల బృందాలను రాష్ట్రంలోకి తీసుకురావడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu