ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి “జగనన్న విద్యా కానుక” పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా 2020–21 విద్యా సంవత్సరం నుంచే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 7 రకాల వస్తువులతో కూడిన కిట్ ను జగనన్న విద్యా కానుకగా కింద అందజేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలలు తెరిచిన మొదటి రోజునే ఈ కిట్ ను విద్యార్థులను అందజేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 39.70 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది, ఇందుకోసం ప్రభుత్వం రూ.650.60 కోట్లు ఖర్చు చేయనుంది.
“జగనన్న విద్యా కానుక” కింద విద్యార్థులకు అందించే కిట్:
- పాఠ్యపుస్తకాలు
- నోట్ బుక్స్
- స్కూల్ బ్యాగ్
- 3 జతల దుస్తుల వస్త్రం
- ఒక జత షూ
- రెండు జతల సాక్స్
- బెల్టు
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu