ఈఎస్ఐ కేసులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు రిమాండ్ ను జూలై 10 వరకు పొడిగిస్తూ అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) న్యాయస్థానం ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి గతంలో ఇచ్చిన 14 రోజుల రిమాండ్ ఈ రోజుతో ముగియడంతో ఏసీబీ కోర్టు రిమాండ్ ను పొడిగించింది. మరోవైపు ఏసీబీ అధికారులు మూడురోజుల పాటు అచ్చెన్నాయుడును విచారించారు. ఈ కేసులో పలు కీలక అంశాలపై సాగిన విచారణ ఈ రోజుతో ముగిసింది. మూడు రోజుల విచారణలో భాగంగా మొత్తం 10.30 గంటలపాటు అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు విచారించినట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu