తెలంగాణలో మరో 985 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 26, శుక్రవారం నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,349 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం నాడు 4374 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో ఏడుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 237 కి పెరిగింది. కోవిడ్ నుంచి మరో 78 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 4766 కి చేరింది. ప్రస్తుతం 7436 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(985):
- జీహెచ్ఎంసీ ఏరియా – 774
- రంగారెడ్డి – 86
- మేడ్చల్ – 53
- వరంగల్ అర్బన్ – 20
- మెదక్ – 9
- ఆదిలాబాద్ – 7
- సిరిసిల్ల – 6
- నిజామాబాద్ – 6
- నాగర్ కర్నూల్ – 6
- సిద్దిపేట – 3
- భూపాలపల్లి – 3
- ఖమ్మం – 3
- ములుగు – 2
- జగిత్యాల – 2
- యాదాద్రి భువనగిరి – 2
- వికారాబాద్ – 1
- మహబూబ్ నగర్ – 1
- మిర్యాలగూడ – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu