ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 14, మంగళవారం నాడు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నివారణ చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేల రూపాయల చొప్పున ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల విషయంలో రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
కరోనా నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలు:
- కరోనా బాధితులకు ఏ ఆసుపత్రులైనా వైద్యం చేయడానికి నిరాకరిస్తే కఠిన చర్యలు.
- వైద్యం అందించడానికి నిరాకరిస్తూ, ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే ఆస్పత్రుల అనుమతులు రద్దు.
- క్వారంటైన్ సెంటర్ల మీద అధికారులు శ్రద్ద పెట్టాలి, వచ్చే వారం రోజులు వాటిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి.
- కోవిడ్ కేర్ సెంటర్లు, క్వారంటైన్ కేంద్రాల వద్ద ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్ నంబర్తో హోర్డింగ్ ఏర్పాటు చేయాలి.
- కంటైన్మెంట్ ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను వినియోగించి పరీక్షల నిర్వహణ.
- అవసరాలకు అనుగుణంగా 17 వేలకు పైగా డాక్టర్లు, 12 వేలకు పైగా నర్సుల సేవలు పొందేందుకు అధికారులు రూపొందించిన ప్రణాళికకు అంగీకారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu