ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదలకు రాజధాని అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపుకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టాల సవరణకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీనికి సంబంధించి తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఏపీ ప్రభుత్వం ఇలా పేదలకు కూడా రాజధాని ప్రాంతంలో ఇళ్ళు కేటాయిచేలా గతకొన్ని రోజుల క్రితం ఒక కీలక చట్ట సవరణ చేసింది.
దీనిప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలవుతున్న గృహ నిర్మాణ పథకాలు కేవలం ఒక్క రాజధాని ప్రాంతంలోని వారికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర జిల్లాల్లోని అర్హులైన వారికి కూడా అందించే వీలుంటుంది. అలాగే దీనిలో సంబంధిత పాలకవర్గంతో పాటు ప్రత్యేకాధికారి కూడా నిర్ణయం తీసుకునేలా సీఆర్డీఏ చట్టాన్ని సవరించింది. అంతేకాకుండా మాస్టర్ ప్లాన్లో అవసరానికి అనుగుణంగా ఏవైనా మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. వీటన్నింటిని పరిశీలించిన గవర్నర్ తాజాగా ఆమోద ముద్ర వేశారు. ఇక గవర్నర్ నిర్ణయంతో ఏపీలోని అర్హులైన పేదలకు రాజధానిలో కూడా ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు మార్గం సుగమం అయ్యింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY