దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొంత హెచ్చు, తగ్గులతో 1500-3000 మధ్యనే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 2,141 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 20, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,36,517 కు చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.85 శాతంగా నమోదైంది. అలాగే కరోనాతో మరో 20 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,28,943 కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో 25,510 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.76 శాతం:
దేశంలో ప్రస్తుతం 25,510 (0.06%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 2,579 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,40,82,064 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇక అక్టోబర్ 19, బుధవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 89.94 (89,94,39,208) కోట్లకు చేరుకుంది. గత 24 గంటల్లో 2,51,515 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY