తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 28, శనివారం నాడు టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను తిరుమలలో జరిగిన మీడియా సమావేశంలో వై.వి.సుబ్బారెడ్డి వివరించారు.
టీటీడీ పాలక మండలి నిర్ణయాలు:
- టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు నియామకానికి ఆమోదం
- 2019-20 వార్షిక బడ్జెట్ కింద రూ.3243 కోట్లకు పాలకమండలి ఆమోదం
- రూ.14 కోట్లతో ముంబైలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం
- టీటీడీ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు
- ఘాట్రోడ్డు భద్రతా ప్రమాణాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం
- ఘాట్ రోడ్డు మరమ్మత్తుల కోసం రూ.10 కోట్లు
- రూ.14.30 కోట్లతో టీటీడీ పరిపాలనా భవనం మరమత్తులు
- జమ్ముకశ్మీర్, వారణాసిలోనూ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించేలా ప్రణాళికలు
- 2019-20 సంవత్సరానికి గానూ శ్రీవారి హుండీ ఆదాయం రూ.1285 కోట్లు
- ప్రసాదాల విక్రయం ద్వారా సమకూరిన ఆదాయం రూ.330 కోట్లు
- సంక్రాంతి లోపు తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం దిశగా అడుగులు
[subscribe]