గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. మొదటగా నటి హేమ ఎలిమినేట్ అవ్వగా వైల్డ్ కార్డు ఎంట్రీగా తమన్నా సింహాద్రి ఇంటిలోకి వచ్చింది, తరువాత జర్నలిస్ట్ జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. జాఫర్ ఎలిమినేషన్ తో ఇంటిలో 14 మంది సభ్యులున్నారు. ఆగస్టు 9న ప్రసారమైన బిగ్ బాస్-3 పందోమ్మిదవ ఎపిసోడ్ లో అద్దం పగలగొట్టమని రవికృష్ణను ప్రోత్సహించింది అనే కారణంతో బిగ్ బాస్ శ్రీముఖిని వచ్చే వారం నేరుగా నామినేట్ చేస్తునట్టు ప్రకటించాడు. ఇక అలీరేజా-పునర్నవికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ గురించి మిగతా ఎపిసోడ్ అంతా నడిచింది.
ఎపిసోడ్ 19( ఆగస్టు 8) హైలైట్స్: శ్రీముఖి నామినేషన్, అలీరేజా-పునర్నవి సీక్రెట్ టాస్క్
- ఎపిసోడ్ మొదలవుగానే డంబెల్ తో అద్దం పగల కొట్టిన విషయంపై వితికా, పునర్నవి, రాహుల్ మాట్లాడుకున్నారు
- డంబెల్ ఐడియా మహేష్ ఇచ్చాడని, అదే విషయం బాబాబాస్కర్ తో కూడ చర్చించానని శ్రీముఖి ఇంటి సభ్యులతో చెప్పింది
- చేతితో అద్దాలు ఎలా పగలగొట్టావని రవికృష్ణ పై రాహుల్ సీరియస్ అయ్యాడు
- రాహుల్ మాటలతో హార్ట్ అయిన శ్రీముఖి బాత్రూంలో ఏడ్చేసింది
- జరిగిన సంఘటన పట్ల రవికృష్ణ కన్ఫెషన్ రూములో బిగ్ బాస్ కి సారీ చెప్పాడు
- బిగ్ బాస్ హౌజ్ లో హింస జరిగిందని, టాస్క్ ను రద్దు చేసాడు
- అద్దం పగలగొట్టమని రవికృష్ణను ప్రోత్సహించింది అనే కారణంతో బిగ్ బాస్ శ్రీముఖిని వచ్చే వారం నేరుగా నామినేట్ చేస్తునట్టు ప్రకటించాడు.
- అలీరేజాకు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు, ఈ టాస్క్ విజయవంతముగా పూర్తి చేస్తే వచ్చే వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అవుతారని చెప్పారు
- రాత్రివేళ, అందరూ నిదురించిన సమయంలో ఇంటి సభ్యులు ఎవరు చూడకుండ ఒక సీక్రెట్ రూములోకి వెళ్లాలని బిగ్ బాస్ అలీకి సూచిస్తాడు
- ఇదే విధంగా పునర్నవి కి కూడ టాస్క్ ఇచ్చి, అవే రూల్స్ చెప్పి తెల్లవారుజామున సీక్రెట్ రూములోకి వెళ్లాలని బిగ్ బాస్ చెబుతాడు
- అలీరేజా, పునర్నవి విజయవంతంగా సీక్రెట్ రూములలోకి వెళతారు
- ఉదయం మాయ మచింద్ర సాంగ్ కి ఇంటి సభ్యులు డాన్స్ చేసారు
- అలీ, పునర్నవి కనిపించకపోవడంతో ఇంటి సభ్యులు వెతుకులాట ప్రారంభించారు
- అలీ, పునర్నవి లను బయటకు వెళ్ళడానికి, ఇంటి సభ్యులు ఏది త్యాగం చేయాలో చెప్పమని అడగగా వారు పెరుగు, చెప్పులు అని చెప్పారు
- అలీ, పునర్నవి ఇంటిలోకి రావాలని ఎంతమందికి అనిపిస్తుంది అని బిగ్ బాస్ అడగగా, హిమజ, బాబాబాస్కర్ తప్ప మిగతా సభ్యులు వాళ్ళు మళ్ళీ రావాలని కోరుకున్నారు
- అయితే వారు తిరిగి రావాలంటే ఇంటి సభ్యులు రెండు త్యాగాలు చేయాలనీ బిగ్ బాస్ కోరారు
- వారం రోజుల పాటు ఇంటిలో చెప్పులేసుకుని తిరగకూడదని, భోజనంలో పెరుగు ఉండదని చెప్పగా ఇంటి సభ్యులు అంగీకారం తెలిపారు
- నలుగురు మగ సభ్యులకు సంబంధించిన పరుపులు, పాలు, గుడ్లు స్టోర్ రూములో పెట్టాలి అని బిగ్ బాస్ ఆదేశించారు
- ఎవరు తరువాత కెప్టెన్ అవుతారు అనే ఆసక్తికర అంశాలతో ఈరోజు ఎపిసోడ్ సాగనుంది.