మహారాష్ట్రలోని కణకావలీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్సి) శాసనసభ సభ్యుడు నితేష్ నారాయణ్ రాణే ప్రభుత్వ అధికారిపై దాడి చేశారు. జూలై 4 న, నితేష్ రాణే తన మద్దతుదారులతో కలిసి, కణకావలీ ముంబై-గోవా హైవే సమీపంలో ఉన్న వంతెన వద్ద ప్రభుత్వ హైవే ఇంజనీర్ ప్రకాష్ షెడేకర్ పై రెండు బకెట్ల బురదను పోశారు. జూలై 4 మధ్యాహ్నం నితేష్ రాణే రహదారిని తనిఖీ చేస్తున్నప్పుడు గుంతలు ఎక్కువుగా ఉండడంతో ఆగ్రహం తో అతని అనుచరులతో కలిసి ఇంజనీర్ పై దాడి కి ప్రయత్నించారు .
అనుచరులు ఆ తరువాత, అతన్ని ఒక తాడు సహాయంతో అక్కడి వంతెన కి కట్టడానికి కూడా ప్రయత్నించారు. జరిగిన ఈ సంఘటన పట్ల నితేష్ నారాయణ్ రాణే తండ్రి నారాయణ రాణే క్షమాపణ తెలియజేసారు. ప్రస్తుతం ఆయన బిజెపి పార్టీ తరుపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు, గతంలో ముఖ్యమంత్రి గా కూడా పనిచేసారు.