ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీ లో ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయి రెడ్డి నియామకాన్ని రద్దు చేసింది. ఈ ప్రభుత్వం జూన్ 22 న , వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గా కొనసాగుతున్న విజయసాయిరెడ్డిని ఢిల్లీలో వారి ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ని నియమిస్తూ ఇచ్చిన జీవో ని ప్రభుత్వం రద్దు చేసింది.
రాజ్యసభ ఎంపీ గా లాభదాయక పదవిలో కొనసాగుతూ ఉండడం వలన ఈ నియామకాన్ని రద్దు చేసినట్లు ప్రభుత్వం తెలియజేసింది. త్వరలో విజయసాయి రెడ్డి స్థానంలో మరొకరిని ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించనున్నారు.