ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో ద్రౌపది ముర్ము ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ముర్ముకు విమానాశ్రయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్ తదితరులు గిరిజన సంప్రదాయంలో పలికారు. కాగా ఆమె వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. గన్నవరం నుంచి తాడేపల్లి చేరుకొని సీఎం జగన్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
అనంతరం ముఖ్యమంత్రితో కలిసి మంగళగిరి లోని సీకే కన్వెన్షన్లో అధికార వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆమె సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము తన అభ్యర్థిత్వానికి వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల మద్దతును కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీరాజు, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు తొలిసారి అవకాశం లభించింది. వైఎస్సార్సీపీ మొదటినుంచి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. అందుకే మనమందరం ముర్ముకే ఓటేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ