నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 31 వ రోజుకు చేరుకుంది. గతకొన్ని రోజులుగా కేంద్రప్రభుత్వం, రైతు సంఘాల మధ్య చర్చలకు సంబంధించి ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం రైతు సంఘాల సభ్యులు సమావేశమై కేంద్రం నుంచి వచ్చిన ప్రతిపాదనలు, చర్చలకు సంబంధించిన లేఖపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 29, మంగళవారం ఉదయం 11 గంటలకు కేంద్రంతో తదుపరి రౌండ్ చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
ముఖ్యంగా మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులు, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కు చట్టబద్ధమైన హామీ, రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ముసాయిదా విద్యుత్ సవరణ బిల్లు-2020 లో మార్పులు, రైతులపై నమోదు చేసిన కేసుల ఉపసంహరణ వంటి అంశాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, వీటి ఆధారంగా మంగళవారం నాడు కేంద్రం చర్చలు నిర్వహించాలని కోరారు. ఇంతకుముందు జరిగిన చర్చల్లో వాస్తవాలను వక్రీకరించవద్దని రైతు సంఘాలు కేంద్రాన్ని కోరాయి. మూడు చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్ను వారు మరోసారి పునరుద్ఘాటించారు. మరోవైపు డిసెంబర్ 30 న సింఘా సరిహద్దు నుండి కుండ్లి-మానేసర్-పాల్వాల్ రహదారిపై ట్రాక్టర్ మార్చ్ నిర్వహించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ