దేశంలో శనివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,69,118 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,47,343 కు పెరిగింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 22,273 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం 22,274 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. గత 29 రోజుల నుండి రోజువారీగా నమోదైన కరోనా కేసుల కంటే దేశంలో రోజువారీగా రికవరీ అవుతున్నవారే ఎక్కువున్నారు. మరోవైపు కొత్తగా నమోదయిన కేసులలో దేశంలోని కేవలం 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుండే 79.16 శాతం నమోదయ్యాయి.
కొత్త కేసుల్లో 79 శాతం నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే :
- కేరళ – 5397
- మహారాష్ట్ర – 3431
- వెస్ట్ బెంగాల్ – 1541
- ఉత్తరప్రదేశ్ – 1414
- మధ్యప్రదేశ్ – 1031
- తమిళనాడు – 1027
- రాజస్థాన్ – 1023
- కర్ణాటక – 1005
- గుజరాత్ – 910
- ఛత్తీస్ గడ్ – 853
మరోవైపు గత 24 గంటల్లో 251 మరణాలు నమోదవగా దేశంలోని 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలోనే 85.26 శాతం నమోదయ్యాయి.
251 మరణాల్లో 85 శాతం నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే :
- మహారాష్ట్ర – 71
- వెస్ట్ బెంగాల్ – 31
- ఢిల్లీ – 30
- కేరళ – 16
- ఛత్తీస్ గడ్ – 14
- ఉత్తరప్రదేశ్ – 12
- మధ్యప్రదేశ్ – 12
- తమిళనాడు – 12
- పంజాబ్ – 9
- రాజస్థాన్ – 7
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ