న్యూజిలాండ్లో పర్యటిస్తున్న భారత్ ఆదివారం రెండో వన్డే ఆడనుంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా రేపు జరుగనున్న ఈ మ్యాచ్ సెడెన్ పార్క్ వేదికగా జరుగనుంది. ఇప్పటికే తొలి వన్డేలో దారుణ పరాజయం పాలైన టీమిండియా సిరీస్లో 1-0తో వెనుకంజలో ఉంది. రేపటి మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ రేసులో నిలవాలని పట్టుదలగా ఉంది. తొలి వన్డేలో 300 పైచిలుకు భారీ స్కోరు చేసినా.. లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. బౌలర్లు పూర్తిగా విఫలం కావడంతో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అంతేకాకుండా న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్స్ లాథమ్, కెప్టెన్ విలియమ్సన్లు నాలుగో వికెట్కు ఏకంగా 221 పరుగులు జోడించారంటే టీమిండియా బౌలింగ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్ కోసం జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. అయితే శిఖర్ ధవన్ నేతృత్వంలోని భారత్ బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. తొలి వన్డేలో ధవన్, శుభమన్ గిల్తో పాటు మిడిలార్డర్లో శ్రేయాస్ అయ్యర్ రాణించారు. వీరికి సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్ లు తోడ్పాటు అందించారు. ఇక ఇదిలా ఉండగా, మరోవైపు ఈ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ జరుగనున్న హమిల్టన్ సిటీలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ ఇప్పటికే ప్రకటించింది. దీంతో రేపటి మ్యాచ్పై అభిమానులు కొంచెం నిరాశ చెందుతున్నారు.
జట్లు అంచనా..
భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE