నేడు ఇప్పటం రైతులకు ఆర్థిక సాయం అందించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan will Hand Over Financial Assistance Cheques to Ippatam Farmers Today,Court Verdict On Ippatam, Janasena Propaganda Is False ,Minister Ambati Rambabu, Janasena Party Chief Pawan Kalyan, Janasena Party Founder, Mango News, Mango News Telugu, Pawan 1Lakh Financial Assistance,Pawan Kalyan Ipatam Village Visit, Pawan Kalyan Latest News And Updates, Pawan Kalyan News And Live Updates, Pawan Kalyan Visits Ipatam, Power Star, Power Star Ippatam Village Visit, Power Star Pawan Kalyan, Pspk, Tension In Ippatam

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు (నవంబర్ 27, ఆదివారం) గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతకు గురైనవారికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రమే హైదరాబాద్ నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

ఇప్పటం రైతులకు ఆర్థిక సాయం అందించడంపై జనసేన పార్టీ ప్రకటన విడుదల చేస్తూ, “జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వేదికై నిలిచిన గ్రామం ఇప్పటం. ఆ గ్రామ రైతులు పార్టీ కార్యక్రమ సభా ప్రాంగణం కోసం తమ పొలాలను ఇచ్చారు. రహదారి విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో కొన్ని ఇళ్లను కూల్చారు. అప్పుడు ఆ గ్రామస్తులను కలిసి వారి బాధలను తెలుసుకొని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చలించిపోయారు. కూల్చివేతతో నష్టపోయిన ప్రతి ఇంటికీ రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి విదితమే. ఆ ఆర్థిక సాయాన్ని నవంబర్ 27, ఆదివారం నాడు బాధితులకు అందించనున్నారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆర్థిక సాయం చెక్కులను బాధితులకు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా బాధితులు చెక్కులు అందుకుంటారు” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 17 =