భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా కొత్తగా 43,071 పాజిటివ్ కేసులు నమోదవగా, 955 మంది మరణించారు. దీంతో జూలై 4, ఆదివారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 3,05,45,433 కు, మరణాల సంఖ్య 4,02,005 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.
గత 24 గంటల వ్యవధిలో 52,299 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 2,96,58,078 కు చేరుకుంది. ఇక కరోనా రికవరీ రేటు 97.09 శాతం గానూ, మరణాల రేటు 1.32 శాతంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో ప్రస్తుతం 4,85,350 (1.59%) మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ