తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 3, శనివారం నాడు 1,56,195 మందికి మొదటి డోస్, 52416 మందికి రెండో డోస్ కలిపి మొత్తం 2,08,611 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. అలాగే శనివారం రాత్రి 9 గంటల వరకు రాష్ట్రంలో లబ్ధిదారులకు అందించిన మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,16,30,370 చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో 99,38,528 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 16,91,842 మంది లబ్ధిదారులకు రెండో డోస్ కరోనా వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ