దేశంలో 1.40 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. నోటిఫైడ్ ఖాళీల కోసం డిసెంబర్ 15, 2020 నుండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) లను ప్రారంభించబోతోంది. రైల్వే శాఖలో 3 విభాగాల్లో 1.40 లక్షల ఖాళీలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, దాదాపుగా 2.40 కోట్లకు పైగా దరఖాస్తులు వచ్చాయని రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్కుమార్ యాదవ్ వెల్లడించారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంతకు ముందే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కోవిడ్-19 మహమ్మారి మరియు లాక్ డౌన్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని చెప్పారు. డిసెంబర్ 15 నుంచి మొదలయ్యే పరీక్షల పూర్తి షెడ్యూల్ను అతి త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు.
నాన్ టెక్నికల్ పాపులారిటీ-ఎన్టీపీసీ కేటగిరీలో (గార్డులు, ఆఫీస్ క్లర్క్లు, కమర్షియల్ క్లర్క్ల పోస్టులు) 35,208, ఐసోలేటెడ్ మరియు మినిస్టీరియల్ కేటగిరిలో (స్టెనో, టీచ్లు) 1663, లెవల్-1 ఖాళీలు (ట్రాక్ మెయింటెనర్లు, పాయింట్మ్యాన్) 103769 తో కలిపి రైల్వేశాఖలో మొత్తం 1.4లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu