ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘మిత్రమా నీ లక్ష్యం ఎటు?’ అనే అంశంపై మాట్లాడారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనే లక్ష్యం నిర్ణయించుకునే ముందు, మనకున్న కోరికతో పాటు అర్హతను కూడ బేరీజు వేసుకుని ముందుకు సాగాలని చెప్పారు. లక్ష్యం సాధించే క్రమంలో చేయాల్సిన కృషి, కేటాయించాల్సిన సమయం వంటి అంశాలపై విశ్లేషణ చేసారు. ప్రస్తుత కాలంలో అందరూ పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటున్నారని, లక్ష్యాలు పెట్టుకుంటే సరిపోదని ఆచరణలో పక్క ద్రోవ పట్టకుండా విజయం సాధించడం ఎలా అనే విషయాలను వివరించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]