భారత్ లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. దేశంలో ఇప్పటికి 41 లక్షలకు పైగా కరోనా కేసులు, 70 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 90,632 పాజిటివ్ కేసులు నమోదవగా, 1065 మంది మరణించారు. దీంతో సెప్టెంబర్ 6, ఆదివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 41,13,811 కు, మరణాల సంఖ్య 70,626 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ఒకే రోజులో 73,642 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 31,80,865 కు చేరుకుంది.
దేశంలో ఓవైపు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రసుతం కరోనా రికవరీ రేటు 77.3 శాతం గానూ, మరణాల రేటు 1.7 శాతంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ కరోనా కేసులు, మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 8,62,320 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu