కరోనా నేపథ్యంలో జార్ఖండ్ లో సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

Jharkhand, Jharkhand extends lockdown, Jharkhand Government, Jharkhand Government Extends, Jharkhand Government Extends Lockdown, Jharkhand Government Extends Lockdown Till September 30, Jharkhand govt extends lockdown, Jharkhand lockdown extension

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం లాక్‌డౌన్ పై కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్ ను పొడిగిస్తునట్టు జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ ను సెప్టెంబర్ 30 వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు.

పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సంస్థలు, సినిమా థియేటర్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్స్, బార్‌లు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలు తెరవడంపై నిషేధం కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే అంతర్రాష్ట్ర బస్సు సేవలకు అనుమతి లేదని చెప్పారు. అయితే సెప్టెంబరు నెలలో నీట్, జేఈఈ పరీక్షలు నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ బస్సు రవాణాను ప్రారంభించనున్నారు. ఆరునెలల తర్వాత నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో హోటళ్ళు, లాడ్జ్, గెస్ట్ హౌస్ లు, సెలూన్, స్పాలు, బ్యూటీ పార్లర్లు, రెస్టారెంట్లు మరియు షాపింగ్ మాల్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి. మరోవైపు జార్ఖండ్ రాష్ట్రంలో ఆగస్టు 28 నాటికీ 35,813 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఈ వైరస్‌ వలన మొత్తం 389 మంది చనిపోయారు. కరోనా నుంచి కోలుకుని 24,138 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 11,286 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − six =