ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 10548 పాజిటివ్ కేసులు, 82 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 29, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,14,164 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 3796 కి పెరిగింది. మరో 8976 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో 62,024 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.
కరోనా వలన చిత్తూరులో పదిహేను మంది, నెల్లూరులో పదకొండు మంది, తూర్పుగోదావరిలో ఎనిమిది మంది, పశ్చిమగోదావరిలో ఎనిమిది మంది, అనంతపూర్ లో ఆరుగురు, గుంటూరులో ఆరుగురు, కర్నూల్ లో ఆరుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విజయనగరంలో నలుగురు, కృష్ణాలో ఇద్దరు, కడపలో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3796 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 29, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 36,03,345
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 4,14,164
- కొత్తగా నమోదైనా కేసులు : 10548
- నమోదైన మరణాలు : 82
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 3,12,687
- యాక్టీవ్ కేసులు : 97681
- మొత్తం మరణాల సంఖ్య : 3796
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu