కేరళలోని కోజికోడ్లో ఆగస్టు 7న ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వందేభారత్ మిషన్లో భాగంగా 184 మందితో దుబాయ్ నుంచి కోజికోడ్కు చేరుకున్న ఎయిరిండియాకు చెందిన విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఫైలట్లతో సహా 19 మంది మరణించారు. అయితే ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న 22 మంది అధికారులకు కరోనా సోకినట్టుగా తాజాగా వైద్యాధికారులు వెల్లడించారు. మలప్పురం జిల్లా కలెక్టర్ గోపాల కృష్ణన్ సహా 22 మంది అధికారులు కరోనా బారిన పడ్డారని, వారిని క్వారంటైన్ కేంద్రంలో చేర్చినట్లు తెలిపారు. అలాగే ప్రమాదం జరిగిన తర్వాత సంఘటన స్థలాన్ని సందర్శించిన కేరళ సీఎం పినరయి విజయన్ సహా మరో ఎనిమిది మంది సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లినట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu