ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భావితరాలకు స్ఫూర్తి అని, ఆయన వారసత్వం దేశానికి ఏళ్ల తరబడి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి సోమవారం రాజ్యసభలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇది ఒక ఉద్వేగభరితమైన క్షణమని, సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వెంకయ్య నాయుడు బీజేపీ అధ్యక్షుడు సహా అనేక కీలక పదవులు చేపట్టారని తెలిపారు. ఉపరాష్ట్రపతిగా మరియు రాజ్యసభ ఛైర్మన్గా ఐదేళ్ల పదవీకాలాన్ని ఆయన అత్యద్భుతంగా మరియు సమర్ధవంతంగా నిర్వహించారని ప్రశంసించారు.
సభా నిర్వహణలో వెంకయ్య నాయుడు కొత్త ఒరవడిని సృష్టించారని, అవుట్ గోయింగ్ ఛైర్మన్ సంభాషణను ప్రోత్సహించారని, తన తర్వాత బాధ్యతలు చేపట్టనున్న వారికి మార్గదర్శకత్వం వహించే ప్రమాణాలు నెలకొల్పారని ప్రధాని మోదీ కొనియాడారు. ఆయన వివిధ బాధ్యతలు చేపట్టడం మరియు చేపట్టిన ప్రతి ఒక్క దానిని ఎంతో అంకితభావంతో నిర్వహించడం తాను చూశానని, ఉపాధ్యక్షుడిగా వెంకయ్య యువజన సంక్షేమానికి చాలా సమయం కేటాయించారని గుర్తుచేసుకున్నారు. కాగా వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10వ తేదీతో ముగియనుంది. ఆయన తర్వాత కొత్త ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్కర్ త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY