ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (ఫిబ్రవరి 10, శుక్రవారం) ఉత్తర్ ప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు లక్నో చేరుకుంటారు, అక్కడ ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023ను ప్రారంభిస్తారు. అనంతరం ముంబయికి చేరుకొని, మధ్యాహ్నం 2.45 గంటలకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద రెండు వందే భారత్ రైళ్లను (ముంబయి-సోలాపూర్, ముంబయి-సాయి నగర్ షిరిడీ) జెండా ఊపి ప్రారంభించనున్నారు. అలాగే శాంతాక్రూజ్ చెంబూర్ లింక్ రోడ్ మరియు కురార్ అండర్ పాస్ ప్రాజెక్ట్ అనే రెండు రోడ్డు ప్రాజెక్టులను కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4.30 గంటలకు ముంబయిలోని అల్జమియా-తుస్-సైఫియా యొక్క కొత్త క్యాంపస్ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE