తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతుండడంతో గత కొన్నిరోజులుగా ప్రతి రోజూ 100 కి పైగానే కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 18, మంగళవారం ఒక్కరోజే 121 కరోనా మరణాలు, 5709 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,49,654 కి, మరణాల సంఖ్య 6,007 కు చేరింది. అలాగే కరోనా నుంచి కొత్తగా 5,850 మంది కోలుకోవడంతో, డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 2,89,787 కు చేరుకుంది. ప్రస్తుతం 53,860 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు మంగళవారం నాటికీ తమిళనాడు రాష్ట్రంలో 38,45,803 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu