తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1682 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 17, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 93,937 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. సోమవారం నాడు 19,579 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 8 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 711 కి పెరిగింది. ఇప్పటివరకు 72,202 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 21,024 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 76.86 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.75 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1682):
- జీహెచ్ఎంసీ – 235
- రంగారెడ్డి – 166
- వరంగల్ అర్బన్ – 107
- మేడ్చల్ – 106
- నిజామాబాద్ – 94
- కరీంనగర్ – 88
- మంచిర్యాల – 79
- జోగులాంబ గద్వాల్ – 69
- జగిత్యాల – 59
- పెద్దపల్లి – 59
- రాజన్న సిరిసిల్ల – 47
- సిద్ధిపేట – 47
- ఖమ్మం – 45
- కామారెడ్డి – 44
- సూర్యాపేట – 39
- నల్గొండ – 38
- మెదక్ – 36
- మహబూబ్ నగర్ – 32
- జనగామ – 32
- నాగర్ కర్నూల్ – 30
- భద్రాద్రి కొత్తగూడెం – 27
- నిర్మల్ – 27
- వనపర్తి – 23
- యాదాద్రి భువనగిరి – 21
- వరంగల్ రూరల్ – 20
- జయశంకర్ భూపాలపల్లి – 19
- ఆదిలాబాద్ – 18
- సంగారెడ్డి – 18
- ములుగు – 17
- మహబూబాబాద్ – 13
- నారాయణ్ పేట్ – 11
- ఆసిఫాబాద్ – 9
- వికారాబాద్ – 7
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu