దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటివరకు ప్రజలకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 195 కోట్లకు చేరువైంది. జూన్ 11, శనివారం ఉదయం 7 గంటల వరకు దేశంలో పంపిణీ చేసిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 195 కోట్లకు (1,94,92,71,111) చేరువైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
అలాగే దేశవ్యాప్తంగా మార్చి 16 నుంచి 12 మరియు 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు “కోర్బెవాక్స్” కోవిడ్-19 వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేటగిరి కింద ఇప్పటివరకు 3.50 కోట్లమందికిపైగా (3,50,34,278) మొదటి డోస్ వ్యాక్సిన్, 1,91,51,088 మందికి రెండో డోస్ వ్యాక్సిన్ అందించినట్టు తెలిపారు. అదేవిధంగా జనవరి 3 నుంచి 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు/టీనేజర్లకు “కోవాక్జిన్” కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించారు. 15-18 ఏళ్ల కేటగిరి కింద ఇప్పటివరకు 5,98,15,396 మందికి మొదటి డోసు, 4,68,46,961 మందికి రెండో డోస్ వ్యాక్సిన్ వేసినట్టు వెల్లడించారు.
మరోవైపు 18-59 సంవత్సరాల వయస్సు గల వారికి ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఏప్రిల్ 10 నుండి కోవిడ్-19 ప్రికాషన్ డోస్ అందించడం ప్రారంభమవగా, ఇప్పటివరకు 31,55,469 మంది ప్రికాషన్ డోస్ తీసుకున్నారు. ఇక 60 సంవత్సరాలు పైబడినవారికీ ప్రభుత్వం ఉచితంగా ప్రికాషన్ డోస్ డోస్ అందిస్తుండగా, ఇప్పటివరకు 2,07,57,706 మంది తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY