బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు వచ్చారు. జాన్సన్ లండన్ నుంచి నేరుగా ఈ ఉదయం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి చేరుకున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో జాన్సన్కు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్ స్వాగతం పలికారు. ఆయనకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర సీనియర్ అధికారులు, మంత్రులు కూడా వచ్చారు. ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ సర్కిల్ నుండి ఆయన విడిది చేయనున్న నాలుగు కిలోమీటర్ల దూరంలో కల ఆశ్రమం రోడ్లోని ఫైవ్ స్టార్ హోటల్ వరకు ఆయనకు ఘన స్వాగతం లభించింది. బ్రిటీష్ ప్రధాన మంత్రి తన కాన్వాయ్ హోటల్కు వెళుతుండగా విమానాశ్రయం వద్ద మరియు రోడ్డు వెంబడి సంప్రదాయ గుజరాతీ నృత్యాలు మరియు సంగీతాన్ని ప్రదర్శిస్తూ బృందాలు స్వాగతం పలికాయి.
ఈరోజు గుజరాత్లో రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలతో క్లోజ్డ్ డోర్ మీటింగ్ను నిర్వహించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం ద్వారా ఇరు దేశాలలో సరికొత్త పారిశ్రామిక పెట్టుబడులకు ప్రతిపాదనలు ఆశిస్తున్నారు. ఆ తర్వాత, జాన్సన్ పంచమహల్ జిల్లాలోని హలోల్ సమీపంలోని బ్రిటిష్ నిర్మాణ సామగ్రి సంస్థ అయిన JCB తయారీ కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఆ తర్వాత గాంధీనగర్లోని నిర్మాణంలో ఉన్న గుజరాత్ బయోటెక్నాలజీ విశ్వవిద్యాలయం క్యాంపస్ను సందర్శిస్తారు, ఎందుకంటే UK యొక్క ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం సహకారంతో వర్సిటీ వస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వ ప్రకటన తెలిపింది. అనంతరం జాన్సన్ తన గుజరాత్ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి బయలుదేరే ముందు గాంధీనగర్లోని స్వామినారాయణ్ శాఖకు చెందిన ప్రసిద్ధ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు.
రేపు దేశ రాజధాని ఢిల్లీలో బ్రిటీష్ ప్రధాన మంత్రి జాన్సన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కీలక భేటీ జరుగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో బోరిస్ జాన్సన్ చర్చల్లో ప్రధాన దృష్టి ఇండో-పసిఫిక్లోని పరిస్థితిపై ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎలాంటి బలవంతం చేయడాన్ని UK తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందుకే ఇండో-పసిఫిక్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని మరియు రక్షణ సంబంధాలను పెంపొందించుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇరు దేశాల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఇది దోహద పడుతుందని పరిశీలకుల అంచనా. భారత పర్యటనకు బయలుదేరేముందు ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తమ దేశంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. అలాగే చర్చలను నిలిపివేసే సమస్యపై మరింత అనుకూలంగా ఉండేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సంకేతాలిచ్చారు. వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బిలియన్ల పౌండ్లకు పెంచగల స్వేచ్ఛా-వాణిజ్య ఒప్పందాన్ని సాధించడానికి ఈ ఏడాది భారత్కు మరిన్ని వీసాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ