శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో, సూర్య కీలక అతిధి పాత్రలో నటించగా సంచలన విజయం సాధించిన ‘విక్రమ్’ సినిమాపై విశ్లేషణ చేశారు. అద్భుతమైన మూడు పాత్రల చిత్రీకరణతో ఈ సినిమా సాగిందన్నారు. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, నటీనటుల పెర్ఫార్మన్స్ మరియు దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాను తీర్చిదిద్దిన విధానం సహా సినిమాలో పలు అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇