తెలంగాణ బడ్జెట్పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. సోమవారం అసెంబ్లీలో ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆర్ధిక సంవత్సరం 2023-24 సంవత్సరానికి సంబంధించి సుమారు 2.90 లక్షల కోట్లతో మంత్రి బడ్జెట్ ప్రకటించారు. అయితే దీనిపై వైఎస్ షర్మిల పలు ఆరోపణలు చేశారు. ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేని బడ్జెట్ను కేసీఆర్ సర్కార్ ప్రకటించిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి వైఎస్ఆర్టీపీ అధినేత్రి వ్యాఖ్యలను ఖండించారు.
ఈ సందర్భంగా మంగళవారం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బడ్జెట్పై వైఎస్ షర్మిల వ్యాఖ్యలు బాధాకరం, ఆమె అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం తొలినుంచి తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకమేనని, నాడు సమైక్యాంధ్రను సమర్ధించిన వ్యక్తి షర్మిల అని తెలిపారు. తన అన్న, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ గతంలో జైల్లో ఉన్నప్పుడు ఆయన పార్టీ తరపున షర్మిల పాదయాత్ర చేశారని, ఆంధ్రా మూలాలున్నందున ఆమె అక్కడకు వెళ్లి రాజకీయం చేసుకోవడం మంచిదని హితవు పలికారు. తెలంగాణలో రాజకీయం చేయడం వల్ల షర్మిలకు ఎలాంటి ఉపయోగం లేదని, అనవసరంగా ఇక్కడ తిరిగి ఆమె సమయాన్ని చేసుకోవడం వృథా ప్రయాసే అవుతుందని అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE