దేశం అంతా అదానీ వ్యవహారంపై మాట్లాడుతోందని, దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ. ఈ మేరకు మంగళవారం ఆయన పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొన్నారు. ఇటీవలే భారత్ జోడో యాత్రను ముగించుకుని వచ్చిన ఆయన ఈరోజు నుంచి సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా లోక్సభలో ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోదీని అదానీ గ్రూప్ వివాదంపై పలు ప్రశ్నలు సంధించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టారు.
పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రసంగంలోని కొన్ని కీలక అంశాలు..
- గౌతమ్ అదానీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
- అనతికాలంలోనే వ్యాపారవేత్త అదానీ ఆస్తులు 8 బిలియన్ల డాలర్ల నుంచి 140 బిలియన్ల డాలర్లకు ఎలా పెరిగాయి?
- వివిధ వ్యాపారాలలోకి అదానీ గ్రూప్ అనుమతించడానికి ప్రభుత్వ నియమాలు ఎందుకు మార్చబడ్డాయి?
- తమిళనాడు మరియు కేరళ నుండి హిమాచల్ ప్రదేశ్ వరకు, మేము ప్రతిచోటా ‘అదానీ’ అనే పేరు వింటున్నాము.
- అదానీ ఏదైనా వ్యాపారంలోకి ప్రవేశిస్తే ఎప్పుడూ విఫలం కాలేదా? అని ప్రజలు నన్ను అడిగేవారు.
- 2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎయిర్పోర్టులను అభివృద్ధి చేసే బాధ్యతను కేవలం ఒక కంపెనీ/వ్యక్తికి మాత్రమే అప్పగించాలనే నిబంధనను మార్చి, ఆరు విమానాశ్రయాలను అదానీకి అప్పగించారు ఎందుకు?
- మీరు అదానీతో కలిసి ఎన్నిసార్లు విదేశీ పర్యటన చేశారు?
- మీ పర్యటనల తర్వాత అదానీ విదేశాల్లో ఎన్నిసార్లు కాంట్రాక్టు పొందారు?
- గత 20 ఏళ్లలో బీజేపీకి అదానీ ఎంత డబ్బు డొనేట్ ఇచ్చారు?
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE