తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి కెటి రామారావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి చురకలంటించారు. హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ను ఏర్పాటు చేయాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి గతంలో ట్వీట్ చేశారు. అయితే మంగళవారం గుజరాత్లోని జామ్నగర్లో ప్రధాని మోదీ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గతంలో దీనిపై కిషన్ రెడ్డి ట్వీట్ చేసిన సదరు స్క్రీన్షాట్ను కేటీఆర్ ట్యాగ్ చేశారు. “తెలంగాణపై మోదీ జీ యొక్క వివక్ష యొక్క కథ నిరంతరాయంగా కొనసాగుతుంది” అని మంత్రి కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Congratulations to Kishan Reddy Ji, Cabinet Minister in NPA Govt on bringing a prestigious national institute to the state 👏
Oh wait!! As usual, the PM of Gujarat decided that it should move to Jamnagar
The saga of Modi Ji’s discrimination against Telangana goes on unabated👇 pic.twitter.com/Du1mMzXjJE
— KTR (@KTRTRS) April 20, 2022
అలాగే గతంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఐఐఎంలు, ఐఐటీలు, ఐఐఎస్ఈఆర్లు, ఐఐఐటీలు, ఎన్ఐడీలు, నవోదయ, మెడికల్ కాలేజీలు.. వీటిలో ఏ ఒక్కటీ తెలంగాణకు కేటాయించలేదని కేటీఆర్ ఉద్ఘాటించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఇచ్చిన హామీని కూడా మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేసమయంలో కేంద్రం జాతీయ ఇన్స్టిట్యూట్లను ఇతర రాష్ట్రాలకు మంజూరీ చేస్తోందని వెల్లడించారు. అందుకే తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష చూపుతున్నారని తాము భావిస్తున్నామని మంత్రి కేటీఆర్.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి కిషన్రెడ్డిలపై బుధవారం నాడు ఆరోపించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ