గోల్కొండ కోట వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుటకు చేస్తున్న ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు. రిహార్సల్స్, పోలీసుల మాక్ డ్రిల్ ను తనిఖీ చేసి అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆగస్టు 15వ తేదీ ఉదయం 10.30 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అందుకు సరైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో టిఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, అదనపు డిజి జితేందర్, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, ఎనర్జీ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జిహెచ్ఎంసి కమీషనర్ లోకేశ్ కుమార్ మరియు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ