భారతదేశ సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు మన జవాన్లు ధీటుగా బదులిచ్చారని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. గురువారం ఆమె సికింద్రాబాద్లో మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు గవర్నర్ ధ్రువ పత్రాలను అందజేశారు. అనంతరం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. విజయ్ దివస్ వేడుకల నేపథ్యంలో కాన్వకేషన్ జరుపుకోవడం సంతోషంగా ఉందని, విద్యార్థులు చదువుతో పాటు దేశభక్తిని పెంపొందించుకోవాలని చెప్పారు. దేశంలో ప్రజలు ప్రశాంతమైన జీవితం గడపగలుగుతున్నారంటే దానికి ప్రధాన కారణం మన సైనికులేనని తెలిపారు. రాత్రింబవళ్ళు వారు సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని, సైనికుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఇక మన సైనికులు టెక్నాలజీ వినియోగంలో కూడా ముందుంటున్నారని, వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ