రాష్ట్రంలో నర్సింగ్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. నర్సింగ్ విద్యార్థులకు (జీఎన్ఎం, బీఎస్సీ (నర్సింగ్), ఎమ్మెస్సీ నర్సింగ్) స్టైఫండ్ ను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నర్సింగ్ విద్యార్థులకు స్టైపెండ్ పెంపు వెంటనే అమలులోకి రానుందని పేర్కొన్నారు.
జీఎన్ఎం, బీఎస్సీ (నర్సింగ్) విద్యార్థులకు స్టైపెండ్ పెంపు వివరాలు:
- మొదటి సంవత్సరం – రూ.1,500 నుంచి రూ.5,000 కు పెంపు.
- రెండో సంవత్సరం – రూ.1,700 నుంచి రూ.6,000 కు పెంపు.
- మూడో సంవత్సరం – రూ.1,900 నుంచి రూ.7,000 కు పెంపు.
- నాలుగో సంవత్సరం – రూ.2,200 నుంచి రూ.8,000 కు పెంపు.
ఎమ్మెస్సీ నర్సింగ్ విద్యార్థులకు స్టైపెండ్ పెంపు వివరాలు:
- మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.9 వేలు.
- రెండో సంవత్సరం విద్యార్థులకు రూ.10 వేలు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ