న్యూజిలాండ్ క్రికెట్ జట్టు త్వరలో భారత్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 25 నుంచి 29 వరకు కాన్పుర్ లో తొలి టెస్టు, డిసెంబర్ 3 నుంచి 7 వరకు ముంబయిలో రెండో టెస్టు జరగనుంది. అలాగే నవంబర్ 17, 19, 21 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో భారత్ తో టెస్ట్ సిరీస్ లో తలపడే 15 మంది న్యూజిలాండ్ ఆటగాళ్ల జాబితాను కివీస్ బోర్డు గురువారం నాడు విడుదల చేసింది.
ట్రెంట్ బౌల్ట్ మరియు కోలిన్ డి గ్రాండ్హోమ్ బయో-సెక్యూర్ బబుల్స్ , ఐసొలేషన్ కారణంగా ఎంపికకు అందుబాటులో లేరని చెప్పారు. అనుభవజ్ఞులైన స్పిన్ త్రయం అజాజ్ పటేల్, విల్ సోమర్విల్లే మరియు మిచెల్ సాంట్నర్ లతో పాటుగా యువ ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ ను టెస్టులకు ఎంపిక చేసినట్టు తెలిపారు. ఇక ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ లో పాల్గొంటున్న న్యూజిలాండ్ జట్టే, భారత్ తో జరిగే టీ20 సిరీస్ లో కూడా ఆడనుంది.
న్యూజిలాండ్ టెస్టు జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, విల్ సోమర్విల్లే, టిమ్ సౌథీ, రాస్ టేలర్, విల్ యంగ్, నీల్ వాగ్నర్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ