తెలంగాణలోని ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా నాలుగవ రోజైన శుక్రవారం వటపత్రశాయి అలంకార సేవలో స్వామి వారు ఊరేగారు. ఈ ఉదయం పూజారులు కల్యాణ మండపంలో స్వామివారిని వట పత్రాలపైన అలంకరించారు. పశ్చిమ రాజగోపురం గుండా స్వామివారి పల్లకిని మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం వేంచేపు మండపంపై ఆస్థానం చేసి, వేదమంత్రాలు, దివ్యప్రబంధ పశురాలను పఠించారు. ఈ క్రమంలో మాడవీధుల్లో ఊరేగిన శ్రీస్వామి వారి సేవోత్సవంలో రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పాల్గొన్నారు.
ఈ ఉదయం 9.05 గంటలకు యాదగిరి గుట్టకు చేరుకున్న గవర్నర్ తమిళి సైకి తొలుత ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో గవర్నర్ తమిళి సై ముందుగా స్వయంభూ శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆమె ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వామివారి వటపత్రశాయి అలంకార సేవలో పాల్గొన్నారు. ఇక గవర్నర్ పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, యాదాద్రి అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ ఈవో గీత సహా పలువురు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE