తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 12, శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి జూన్ 13, శనివారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 253 కరోనా పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 253 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4737 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం కరోనా బాధితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య 449 కి చేరింది . అలాగే కొత్తగా నమోదైన 8 మరణాలతో కలిపి ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 182 కి పెరిగినట్టు తెలిపారు.
కొత్తగా రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఏరియాలో 179 కేసులు, సంగారెడ్డిలో 24, మేడ్చల్ లో 14, రంగారెడ్డి జిల్లాలో 11, మహబూబ్ నగర్ లో 4, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, నల్గొండ, ములుగు, మంచిర్యాల, సిరిసిల్ల జిల్లాలలో 2 కేసుల చొప్పున, సిద్ధిపేట, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, జగిత్యాల జిల్లాలలో ఒక్కోకేసు చొప్పున మొత్తం 253 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. కాగా ఇప్పటికే ఈ వైరస్ నుంచి కోలుకుని 2352 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2203 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu