తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని అమీర్పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గవర్నర్ ప్రికాషన్ డోస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ సిబ్బందికి గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. జూలై 15 నుండి ఉచిత ప్రికాషన్ డోస్ సేవలను ప్రకటించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా గవర్నర్ ధన్యవాదాలు చెప్పారు. అర్హులైన వారంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు.
ముందుగా దేశంలో జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా జూలై 15, 2022 నుండి వచ్చే 75 రోజుల వరకు ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాలలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 60 సంవత్సరాలు పైబడినవారికీ ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో గతం నుంచే ఉచితంగా ప్రికాషన్ డోస్ అందిస్తుండగా, 18-59 సంవత్సరాల వయస్సు గల వారికి కూడా జూలై 15 నుంచి ఉచితంగా ప్రికాషన్ డోస్ అందిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY