దేశంలో రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ కి కూడా ఈ రోజు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మూడు రోజుల క్రితం మంత్రి కరోనా వైద్య పరీక్షలు చేయించుకోగా, ఈ రోజు పాజిటివ్ గా తేలినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu