తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక మంత్రి కేటీఆర్ ను సోమవారం నాడు ప్రగతి భవన్ లో భారత క్రికెటర్ హనుమ విహారి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా హనుమ విహారి ని మంత్రి కేటీఆర్ శాలువాతో సన్మానించారు. ఈ భేటీలో ఆస్ట్రేలియా పర్యటన వివరాలను మంత్రితో హనుమ విహారి పంచుకున్నట్టు తెలుస్తుంది. అలాగే క్రికెట్ బ్యాట్ ను కూడా మంత్రి కేటీఆర్కు అందజేశారు. అనంతరం ఈ భేటీపై హనుమ విహారి స్పందిస్తూ మంత్రి కేటీఆర్ ను కలవడం మరియు క్రికెట్ గురించి సంభాషణ చేయడం చాలా ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు.
It was a pleasure meeting you and having a conversation about cricket sir.@KTRTRS pic.twitter.com/SyYB64HAGG
— Hanuma vihari (@Hanumavihari) January 18, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ