ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ను జూలై 10, శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ఏపీఎస్పీ బెటాలియన్ అదనపు డీజీగా నియమించారు. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబుకు ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu