ఏపీలో కాపులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాపు రిజర్వేషన్ అంశాలపై కాపు సంక్షేమ సేన ప్రతినిధులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను శుక్రవారం నాడు మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కాపు సంక్షేమసేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య నేతృత్వంలోని బృందంతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా తన సోదరుడు, ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి జనసేనలోకి వస్తున్నారా అని విలేకర్లు ప్రశ్నించగా పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ “అన్నయ్యగా చిరంజీవి తమ్ముడు అభివృద్ధిని కోరుకొంటారు. అన్నయ్య ఆశీస్సులు ఉంటాయి. పార్టీలోకి వస్తారా అనేది ఇప్పుడే చెప్పలేను” అన్నారు.
ముందుగా కాపులతో పాటు ఆర్థికంగా, సామాజికంగా అణగారిన అన్ని వర్గాలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 1930 నుంచే కాపు కులంలో విభజించు, పాలించు సిద్ధాంతం మొదలయ్యిందని, అది ఈ రోజుకీ కొనసాగుతోందన్నారు. కాపులకు రాజకీయ సాధికారిత వచ్చిన రోజు, మిగిలిన అన్ని వెనుకబడిన కులాలకు విముక్తి లభిస్తుందని చెప్పారు. బీసీ కులాలకు ఇబ్బంది లేకుండా కాపుల న్యాయమైన డిమాండ్లను జనసేన పార్టీ బలంగా ముందుకు తీసుకెళ్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ