తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1764 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 28, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 58,906 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా వలన మరో 12 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 492 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.84% (< 1%) శాతంగా ఉంది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 842 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 43,751 కి చేరింది. ప్రస్తుతం 14,663 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 74.3 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 509, మేడ్చల్లో 158, రంగారెడ్డిలో 147, వరంగల్ అర్బన్లో 138, కరీంనగర్ లో 93, సంగారెడ్డిలో 89, ఖమ్మంలో 69, నల్గొండలో 51, నిజామాబాద్ లో 47, మహబూబ్నగర్ లో 47, పెద్దపల్లిలో 44, వరంగల్ రూరల్ లో 41, సూర్యపేటలో 38, భద్రాది కొత్తగూడెంలో 30, నాగర్కర్నూలులో 29, మంచిర్యాలలో 28, మెదక్ లో 23, జోగులాంబ గద్వాల్ లో 22, సిద్దిపేటలో 21, ములుగు లో 17, ఆదిలాబాద్ లో 15, రాజన్న సిరిసిల్లలో 13, జనగామలో 13, జగిత్యాలలో 12, యాదాద్రి భువనగిరిలో 11, కామారెడ్డిలో 10 కేసులు నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu