రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ఆస్తిపన్ను బకాయిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. జీహెచ్ఎంసీ, సహా ఇతర మున్సిపాలిటీల్లో కూడా ఓటీఎస్ (వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్) పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ పథకం కింద ఆస్తి పన్ను బకాయిదారులంతా 2019-20 సంవత్సరానికి ఆస్తి పన్ను మొత్తాన్ని పది శాతం వడ్డీతో కడితే, 90 శాతం వడ్డీ మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఆగస్టు 1 వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అసలు, వడ్డీతో కలిసి ఆస్తి పన్ను బకాయిలు భారీగా పేరుకుపోవడంతో, పన్ను చెల్లింపుదారులకు కూడా ప్రయోజనం కల్గించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu