దేశంలో కరోనా విజృంభణతో జూలై 28, మంగళవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,83,156 కు చేరుకుంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రభావం పెరుగుతుండడంతో ఇప్పటికే లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో గతంలోనే లక్షకు పైగా కరోనా కేసులు నమోదవగా, తాజాగా ఆ జాబితాలోకి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక చేరాయి. కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుండడంతో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నప్పటికీ, కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. అలాగే మరణాలు తగ్గించడంపై కూడా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నాయి.
దేశంలో లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు(జూలై 28 వరకు):
మహారాష్ట్ర:
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య – 19,72, 346
- నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 3,91,440
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 2,32,277
- యాక్టీవ్ కేసులు – 1,44,694
- మొత్తం మరణాల సంఖ్య – 14,165
తమిళనాడు:
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య – 24,75,866
- నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 2,27,688
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 1,66,956
- యాక్టీవ్ కేసులు – 57,073
- మొత్తం మరణాల సంఖ్య – 3,659
ఢిల్లీ:
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య – 9,76,827
- నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 1,32,275
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 1,17,507
- యాక్టీవ్ కేసులు – 10,887
- మొత్తం మరణాల సంఖ్య – 3,853
ఆంధ్రప్రదేశ్:
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య – 17,49,425
- నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 1,10,297
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 52,622
- యాక్టీవ్ కేసులు – 56,527
- మొత్తం మరణాల సంఖ్య – 1,148
కర్ణాటక:
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య – 12,42,771
- నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 1,07,001
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 40,504
- యాక్టీవ్ కేసులు – 64,431
- మొత్తం మరణాల సంఖ్య – 2,057
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu