దేశంలో కరోనా ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ఈ రోజు ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 28,36,925 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరో కేంద్రమంత్రికి కరోనా సోకింది. కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా పాజిటివ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటించారు.
“కొద్దిగా అనారోగ్య లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్ష చేయించుకోగా, ఫలితం పాజిటివ్ గా వచ్చింది. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు, నాతో సమావేశాల్లో పాల్గోన్న వారంతా ఇతరుల నుండి వేరుగా ఉండి, కరోనా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. మీరందరూ ఆరోగ్యంగా ఉండండి మరియు మీ గురించి జాగ్రత్తగా వహించండి” అని మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ట్వీట్ చేశారు.
अस्वस्थता के कुछ लक्षण दिखने पर मैंने कोरोना टेस्ट करवाया और मेरी रिपोर्ट पॉजिटिव आई है। डॉक्टर्स की सलाह पर अस्पताल में भर्ती हो रहा हूँ। मेरा अनुरोध है कि गत दिनों में मेरे संपर्क में जो लोग आये हैं वह स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं। आप सभी स्वस्थ रहें और अपना ध्यान रखें।
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) August 20, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu