కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో కృష్ణానదిపై నిర్మించనున్న వైఎస్ఆర్-వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ఈ రోజు శంకుస్థాపన చేసి, పైలాన్ను ఆవిష్కరించారు. క్యాంప్ ఆఫీస్ నుంచి ఈ ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. వేదాద్రి గ్రామంలో ఈ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పలువురు నాయకులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, వైఎస్ఆర్-వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని ఫిబ్రవరి, 2021 కల్లా పూర్తి చేస్తామని తెలిపారు. రూ.491 కోట్ల వ్యయంతో, 2.7 టీఎంసీల నీటి సామర్ధ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. మూడు మండలాల పరిధిలో మొత్తం 28 గ్రామాలలో 38,607 ఎకరాలకు సాగునీరు అందనుందని సీఎం వైఎస్ జగన్ పేరొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu